రాష్ట్రాన్ని సీఎం జగన్ నియంతలా పాలించాలనుకున్నారని చంద్రబాబు అన్నారు. "విధ్వంసం చేయడమే ఆయన స్వభావం. ఇష్టానుసారం జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు.. 30వేల మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారు. టీచర్లను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారు. స్కూళ్లకు రంగులేసినంత మాత్రాన పిల్లలకు చదువు వస్తుందా?" అని చంద్రబాబు ప్రశ్నించారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.