35 మంది అనుమానితులను విచారిస్తున్నాం: ఎస్పీ విద్యాసాగర్

58చూసినవారు
35 మంది అనుమానితులను విచారిస్తున్నాం: ఎస్పీ విద్యాసాగర్
మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు. సబ్ కలెక్టరేట్ లో జరిగిన ఘటనలో 25 అంశాలకు చెందిన రెవెన్యూ పత్రాలు దగ్ధమయ్యాయని తెలిపారు. పాక్షికంగా కాలిన 700 పత్రాలను రికవరీ చేయగలిగామని చెప్పారు. నిపుణులను పిలిపించి సంఘటన స్థలం నుంచి నమూనాలు సేకరించామని ఎస్పీ విద్యాసాగర్ వివరించారు. ఈ వ్యవహారంలో 35 మంది అనుమానితులను గుర్తించి విచారిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్