టోల్‌ప్లాజా పిల్లర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

69చూసినవారు
ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా దావులూరు వ‌ద్ద‌ టోల్‌ప్లాజా పిల్ల‌ర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మచిలీపట్నం - విజయవాడ నాన్‌స్టాప్ సర్వీస్‌ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్సు నడిపాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్