నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.. ఏపీలోని వైసీపీ మద్దతు కోరింది. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాగా, ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమితో ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.