మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం

66చూసినవారు
మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం రామలింగాపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నరేష్ (22), గణేష్ (23) అనే ఇద్దరు యువకులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియోలు తీసి యువతిని బ్లాక్ మెయిల్ చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్