దక్షిణ కొరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సియోల్కు దక్షిణంగా ఉన్న హ్యాసోంగ్లోని బ్యాటరీ ప్లాంట్లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 20 మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. బ్యాటరీ సెల్స్ పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. వరుసగా బ్యాటరీ సెల్స్ పేలి ప్రాణనష్టం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వీరిలో 75 మంది వరకూ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.