దేశ చరిత్రలోనే ఈరోజు ఒక బ్లాక్ డే. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇందుకు కారణాలేమైనా దేశంలో పూర్తిగా స్వేచ్ఛ లేకుండా పోయింది. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను అరెస్ట్లు చేసి జైళ్లలో పెట్టారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రాథమిక హక్కులను పూర్తిగా కాలరాశారు. పత్రికలపై సెన్సార్ విధించారు. దాదాపు రెండేళ్ల తర్వాత 1977 మార్చి 21న అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు.