వాలంటీర్ల రాజీనామాలపై విచారణ వాయిదా

55చూసినవారు
వాలంటీర్ల రాజీనామాలపై విచారణ వాయిదా
వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలయ్యే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్ వేశారు. 62 వేల మంది రాజీనామా చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. 900 మందిపై చర్యలు తీసుకున్నామని ఈసీ వివరణ ఇచ్చింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్