ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే చాంద్బాషా అనుచరులు మంగళవారం ఆందోళన చేపట్టారు. కదిరి టికెట్ చాంద్బాషాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కదిరి టికెట్ను కందికుంట ప్రసాద్ భార్యకు కేటాయించారు. దాంతో హిందూపురం ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చాంద్బాషా అనుచరులు ఆందోళన చేపట్టారు.