విమానంలో తనకు విరిగిన కుర్చీ కేటాయించారంటూ ఓ ప్రయాణికుడు ఎయిరిండియా కంపెనీపై ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ఈ నెల 4న ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లానని, విండో సీటు కోసం రూ.1000 అదనంగా చెల్లించానని సదరు వ్యక్తి తెలిపాడు. అయితే తనకు విరిగిన కుర్చీ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్పై ఎయిర్ ఇండియా స్పందించి క్షమాపణలు చెప్పింది. తగిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.