భారత్పై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డేనిస్ ఫ్రాన్సిస్ ప్రశంసల వర్షం కురిపించారు. పేదరిక నిర్మూలన, కోట్లాది మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయడంలో భారత్ పనితీరు అద్భుతమని కొనియాడారు. డిజిటలైజేషన్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందని తెలిపారు. ఉన్న చోట నుంచే చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. దీంతో ప్రపంచ వేదికపై భారత పోటీతత్వం పెరుగుతోందని ప్రశంసించారు.