AP: ఇంజినీరింగ్ కౌన్సెలింగులో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22లోగా కాలేజీల్లో చేరాలని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. ఈ గడువులోపు చేరకపోతే ఆ సీట్లను ఖాళీగా భావించి, రెండో విడత కౌన్సెలింగ్ కు మళ్లిస్తామని తెలిపింది. కాలేజీల యాజమాన్యాలు జులై 23న ప్రవేశాల వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని సూచించింది.