నూతన ఎస్ఐ శ్రీనివాసరావును కలిసిన జనసేన నాయకులు

53చూసినవారు
నూతన ఎస్ఐ శ్రీనివాసరావును కలిసిన జనసేన నాయకులు
బుచ్చియ్యపేట ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఏ. శ్రీనివాసరావును శనివారం బుచ్చియ్యపేట మండల జనసేన పార్టీ అధ్యక్షులు డిఎస్ నాయుడు ఆధ్వర్యంలో పలువురు జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్ఐను శాలువాతో సత్కరించి అభినందించారు. శాంతి భద్రతలకు సహకరించాలని ఎస్ఐ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యడ్ల రామమూర్తి, తుంపాల రమేష్, కొల్లి కొండాజీ, బుదిరెడ్ల అరుణ్, దొండా సాయి, రసూల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్