ఏ పి ఆర్ కాలేజీలో సందర్శించిన అరకు ఎమ్మెల్యే

65చూసినవారు
ఏ పి ఆర్ కాలేజీలో సందర్శించిన అరకు ఎమ్మెల్యే
అరకులోయ యండపల్లివలస మహిళా ఏపీఆర్ కళాశాలకి ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సందర్శించారు. హాస్టల్ లో విద్యార్థినులతో మాట్లాడి, పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యార్థినులు హాస్టల్ లో బయటి వ్యక్తులు ఎక్కువగా రావడం ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే ఆయన సబ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.