రైల్వే గేటు పరిసర ప్రాంతంలో కుక్కలు స్వైర విహారం

66చూసినవారు
అరకులోయ మండలంలోని చొంపికి వెళ్లే రైల్వే గేటు పరిసర ప్రాంతంలో వీధి కుక్కల బెడద ఎక్కువ అవుతుంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా దాడి చేయడానికి పాల్పడుతున్నాయని అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు మంగళవారం వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడదపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్