ఎన్నికల ఫలితాల కౌంటింగ్ను పురస్కరించుకుని భీమిలిలో ఉన్న పిఎంపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లకు ఆదివారం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. నార్త్ ఏసిపి బి సునీల్, పిఎం పాలెం లా అండ్ ఆర్డర్ సీఐ వై రామకృష్ణ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరిగింది. స్టేషన్కు పిలిపించి కౌంటింగ్ రోజు ఎవరూ కూడా ఎలాంటి ఘర్షణలకు పాల్పడవద్దని హెచ్చరికలు జారిచేశారు.
సుమారు 70 మంది కౌన్సెలింగ్ లో రౌడీషీటర్లు పాల్గొన్నారు.