పౌష్టికాహార కిట్లు పంపిణీ

77చూసినవారు
పౌష్టికాహార కిట్లు పంపిణీ
రంపచోడవరం మండలం బి వెలమలకోట బీరంపల్లి పంచాయతీలో అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న గర్భిణీలు మరియు బాలింతలకు సుమారు 35 మందికి రూ.26వేల ఖర్చుతో అమెరికా శ్రీసాయి పరబ్రహ్మ మిషన్, స్వర్ణాంధ్ర సేవా సంస్థ రాజమండ్రి వారి ఆర్థిక సహాయంతో శుక్రవారం పౌష్టిక ఆహార కిట్లు అందించారు. ఈ కిట్లలో కందిపప్పు, పెసరపప్పు, బెల్లం, మంచి నూనె, చోడి పిండి, గోధుమపిండి ,ఉప్పు, మినప్పప్పు, వేరుశనగ గుళ్ళు ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్