గుంటూరు మేయర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి: గళ్లామాధవి

68చూసినవారు
భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు ఖండించడం హాస్యాస్పదంగా ఉందని పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మేయర్ కౌరవ సభలో చేసిన వ్యాఖ్యలను 5 ఏళ్ళ తరువాత తప్పు పట్టటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వంశీ చేసిన వ్యాఖ్యలను ఆయన నిజంగా తప్పుబడితే వైసీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్