Mar 28, 2025, 16:03 IST/
వ్యవసాయ బావిలో ఇద్దరు కూలీల మృతదేహాలు
Mar 28, 2025, 16:03 IST
TG: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పైడిగుమ్మల్లోని వ్యవసాయి బావిలో పడి ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఒడిశాకు చెందిన బైద్యనాథ్ బత్ర, హరిసింగ్ మహాజీగా పోలీసులు గుర్తించారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. మార్చి 10వ తేదీ నుంచి ఇద్దరు కూలీలు కనిపించకపోవడంతో పీఎస్లో ఫిర్యాదు చేశారు. స్థానికులు పొలం పనులకు వెళ్తూ మృతదేహాలను గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి మృతదేహాలను బయటకు తీసినట్లు వెల్లడించారు.