ధర్మవరం ప్రెస్ క్లబ్ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని (జే ఏ ఏ పి) సంఘం జర్నలిస్టులు బుధవారం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. పాత్రికేయులు వినియోగించుకోవడానికి పురపాలక సంఘం వారు ప్రభుత్వ భవనాన్ని ప్రెస్ క్లబ్ కోసం గతంలో కేటాయించారని పేర్కొన్నారు. కొంతమంది ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ క్లబ్ లో అందరికీ ఓటు హక్కు లేకుండా చేసి ఇతర జర్నలిస్టులను అవమానిస్తున్నారన్నారు.