హాకీ ఇండియా ఆధ్వర్యంలో జరిగే జాతీయస్థాయి సబ్ జూనియర్ జట్టుకు ధర్మవరానికి చెందిన ఫజలుద్దీన్, శబరీష్ గౌడ్ ఎంపికైనట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు సూర్య ప్రకాశ్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. ఈనెల 23 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు చంఢీగఢ్ జరుగనున్న 14వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు.