మిరపలో గంజాయి సాగు.. రైతు అరెస్ట్
రైతులు ఏదైనా పంటలలో అంతర పంటగా కందులు, కూరగాయలు పండించుకుంటారు. కానీ, శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం మందలపల్లి గ్రామంలోని హనుమంతరాయప్ప అనే రైతు మిరప తోటలో గంజాయి సాగు చేస్తున్నాడు. దీంతో అతడి గురించి తోటి రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పక్కా సమాచారంతో సెబ్ అధికారులు హనుమంత రాయప్ప గంజాయి సాగు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అలాగే ఆ రైతు చేత 13 గంజాయి మొక్కలను పీకించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.