పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. క్రైస్తవ సభకు హాజరయ్యేందుకు బైక్పై రాజమండ్రికి వస్తున్న క్రమంలో పాస్టర్ మృతి చెందాడు. అయితే అతడి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక గురవారం పాస్టర్ అంత్యక్రియలు సికింద్రాబాద్లో జరిగాయి. ఈ క్రమంలో ఆయన సతీమణి జెస్సికా మాట్లాడుతూ.. 'నా భర్త చాలా మంచివాడు. తనను హత్య చేసిన వాళ్లను కూడా క్షమించే అంత మంచివాడు. నేను వాళ్లను క్షమించాను' అంటూ తెలిపారు.