భక్తి శ్రద్ధలతో ఇరుముడిలు కట్టుకున్న భవానీ దీక్షాపరులు

1913చూసినవారు
భక్తి శ్రద్ధలతో ఇరుముడిలు కట్టుకున్న భవానీ దీక్షాపరులు
గుంతకల్లు పట్టణంలోని సత్యనారాయణ పేటలోని శ్రీ దుర్గామాత దేవాలయ సన్నిధిలో శ్రీ భవానీ దీక్షలు చేపట్టిన భక్తులు శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఇరుముడులు (బంధాలు) కట్టుకుని విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ సన్నిధికి బయలు దేరారు. ఆలయ నిర్వాహకులు శ్రీ దుర్గామాత అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. గురుభవానీలు వందలాదిగా తరలివచ్చిన దీక్షాపరులకు ఇరుముడులు కట్టారు. అనంతరం భక్తులు బెజవాడ తరలివెళ్లారు.

ట్యాగ్స్ :