కసాపురం వైభవంగా వెండి రథోత్సవం

561చూసినవారు
గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం రాత్రి వైభవంగా వెండి రథోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి వారి ఉత్సవ మూర్తిని విశేషంగా అలంకరించి వెండి రథంపై అధిష్టించి పూజలు చేశారు. ఆలయ అధికారులు మల్లికార్జున తదితరులు శ్రీ స్వామివారికి హారతులు ఇచ్చారు. అనంతరం అశేష భక్త జనం మధ్య వెండి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్