రాజస్థాన్లోని బార్మర్ జిల్లా బలోత్రా పట్టణంలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. 36 ఏళ్ల రాజు భట్కు 15 ఏళ్ల క్రితమే పెళ్లైంది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 18 ఏళ్ల యువతితో రాజు ప్రేమలో పడ్డాడు. తన పిల్లలను, భార్యను వదిలి ఆమెతో ప్రేమలో మునిగిపోయాడు. సమాజం ఒప్పుకోలేదని, 3 రోజుల క్రిందట రాజు రైలుకు ఎదురు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.