కంబదూరు: ఉరివేసుకుని వివాహిత మహిళ ఆత్మహత్య

61చూసినవారు
కంబదూరు: ఉరివేసుకుని వివాహిత మహిళ ఆత్మహత్య
కంబదూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన లత అనే వివాహిత మహిళ తన ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. చెర్లోపల్లి గ్రామానికి చెందిన లత దసరా పండుగ రోజు ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్