కుందుర్పిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
కుందుర్పి మండల కేంద్రంలోని ఫాదర్ కళ్యాణ మంటపం నందు ఏఎఫ్ ఎకాలాజీ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎఫ్ ఎకాలజీ సిబ్బంది భాస్కర్ బాబు, రమేష్, ఎర్రిస్వామి రెడ్డి, ఋషి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అరుణ హాజరు కావడం జరిగింది. వక్తలు ప్రసంగిస్తూ బాల్య వివాహాలు అరికట్టాలని, మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలన్నారు.