శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో సోమవారం టిడిపిలో టికెట్ మార్చడంతో రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ నామినేషన్ వేయడానికి అభిమానులు వర్గీయులు మధ్య భారీ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతున్న బి. కె పార్థసారథి, ఎమ్మెస్ రాజు కార్లపై కార్యకర్తలు రాళ్ళ దాడి చేశారు. బి కే పార్థసారథి కారు అద్దాలు పగలగొట్టారు. పోలీసులు కార్యకర్తలను అదుపు చేశారు.