టీడీపీ కార్యకర్త రహమతుల్లా ను పరామర్శించిన మంత్రి సవితమ్మ

74చూసినవారు
టీడీపీ కార్యకర్త రహమతుల్లా ను పరామర్శించిన మంత్రి సవితమ్మ
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీలోని రైల్వే స్టేషన్ రోడ్డులో నివాసముంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త హమాలీ రహమతుల్లా మతిస్థిమితం కోల్పోవడంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ బుధవారం ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని పరామర్శించారు. ఈ సందర్బంగా మంత్రి కుటుంబ సభ్యులకు దైర్యంగా ఉండండి అండగా ఉంటామని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్