బుక్కపట్నంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

63చూసినవారు
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా.. సోమవారం బుక్కపట్నం మండలం పాముదుర్తిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డితో పాటు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్