
పుట్టపర్తి: టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రులు
పుట్టపర్తి మండలం కప్పలబండ వద్ద జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈనెల 24న నిర్వహించే జిల్లా టీడీపీ మహానాడు ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర మంత్రి సవితమ్మతో పాటు మాజీ మంత్రి పల్లె, పార్టీ జిల్లా అధ్యక్షులు అంజినప్ప, కదిరి ఎమ్మెల్యే కందికుంట టీడీపీ జిల్లా కార్యాలయాన్ని పరిశీలించారు. మహానాడు కార్యక్రమాన్ని తొలి సారి సత్యసాయి జిల్లాలో నిర్వహించబోయే స్థలాన్ని వారు పరిశీలించి తగు సూచనలు సలహాలు అందించారు.