ప్రజలకు తాగునీరు అందిస్తున్న సత్యసాయి సిబ్బందిపై కక్ష ఎందుకు

54చూసినవారు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి మంచినీటి పథకం కార్యాలయం వద్ద అక్కడి సిబ్బంది మంగళవారం వినూత్న రీతిలో వేపకొమ్మలు నోటిలో పెట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. 6 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని రాఘవేంద్ర చారి ఆరోపించారు. ప్రజలకు తాగునీరు అందిస్తున్న మాపై కక్ష ఎందుకని ప్రశ్నించారు? జిల్లా అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్