నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలకు డిమాండ్

63చూసినవారు
నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలకు డిమాండ్
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. తాడిపత్రి స్థానిక ఏబీవీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ పుస్తకాలు, దుస్తులు, పలు సామగ్రిని అధిక ధరలతో విక్రయిస్తున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు పాఠశాలలను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.