ఆంజనేయస్వామి దేవాలయం భూముల వేలం

60చూసినవారు
ఆంజనేయస్వామి దేవాలయం భూముల వేలం
ఉరవకొండ మండలం బూదగవి శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన 44. 29 ఎకరాల భూమిని శుక్రవారం అర్బన్ సీఐ సురేష్ బాబు, ఆలయ ఈఓ రమేష్ బాబు, కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆలయంలో బహిరంగ వేలం నిర్వహించారు. రూ. 2, 92, 000 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం వేలంలో కేవలం రూ. 1, 41, 000 రాగ ఈ సంవత్సరం రూ. 1, 51, 000 అదనంగా వచ్చినట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.