హలో విద్యార్థి చలో విజయనగరం: ఏఐఎస్ఎఫ్

62చూసినవారు
అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) 49వ రాష్ట్ర మహాసభలు నవంబర్ 27 నుంచి 30 వరకు విజయనగరంలో జరుగుతున్నాయి. ఈ సందర్భం లో గుంతకల్లు బి.టీ పక్కిరప్పా భవనంలో కరపత్రాలు విడుదలయ్యాయి. జిల్లా అధ్యక్షులు హనుమంతు రాయుడు, కుళ్లాయిస్వామి విద్యా ప్రైవేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాలు జరగాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాలను విమర్శించారు.

సంబంధిత పోస్ట్