ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి

73చూసినవారు
ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి
విలువైన వస్తువులతో బస్సుల్లో ప్రయాణించే మహిళలు అప్రమత్తంగా ఉండాలని విడపనకల్లు ఎస్ఐ ఖాజాహుసేన్ సూచించారు. బంగారు, ఇతర వస్తువులను దొంగలించే మహిళా దొంగల ముఠాలు ఇటీవల పట్టుబడ్డాయన్నారు. దీనిపై ప్రయాణికులను చైతన్యం చేస్తూ సిబ్బందితో కలిసి మంగళవారం మండల కేంద్రంలో ప్రయాణికులకు సూచనలిచ్చారు. మహిళా దొంగలు ప్రయాణికులతో మాటలు కలిపి విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారని తెలిపారు.