అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను అధికారులు సస్పెండ్ చేశారు. ఈసీఐ ఆదేశాల మేరకు గిరీషాను సస్పెండ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాల విషయంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఈ నిర్ణయం సంచలనంగా మారుతోంది.