వైసీపీలోకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చేరబోతున్నారని తెలుస్తోంది. ఆయన పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నారని ఎంపీ అయోధ్య రామిరెడ్డి వెల్లడించారు. త్వరలోనే చర్చలు పూర్తి అయిన తర్వాత పార్టీలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ ఏపీ విభాగంలో కీలక నేతగా ఉన్నారు.