మండలంలో జరిగిన అవినీతి పై చర్యలు చేపడతాం: నల్లారి కిషోర్

58చూసినవారు
కలికిరి మండలంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకుంటామని టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. మండల అభివృద్ధి కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్న ఇండ్ల లో జరిగిన అవినీతి ని వెలికితీస్తామని అన్నారు. వైసీపీ నాయకులు భూకబ్జాలు, గ్యాంబ్లింగ్, నీలిచిత్రాలు తీయడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు.