మిట్టావాండ్లపల్లిలో గణనాధుని శోభాయాత్ర

83చూసినవారు
మిట్టావాండ్లపల్లిలో గణనాధుని శోభాయాత్ర
రాయచోటి నియోజకవర్గంలోని మిట్టావాండ్లపల్లి గ్రామంలో సోమవారం వినాయకుని విగ్రహం వద్ద లడ్డూ వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన దేవపట్ల భాను రూ. 48000లకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు భానుని సత్కరించి లడ్డూను అందజేశారు. గణనాథుని ప్రారంభ పూజా కార్యక్రమంలో టిడిపి మాజీ కౌన్సిలర్ మిట్టా సంజీవరెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఈ మేరకు కోలాటాలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో గణనాధుని ఊరేగించారు.

సంబంధిత పోస్ట్