రాష్ట్రంలో ఓపీఎస్ అమలు కావట్లేదని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జీపీఫ్ డబ్బులు సకాలంలో అందట్లేదని, 11వ పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ రాలేదని మండిపడ్డారు. ఉద్యోగులకు రెండు పెండింగ్ డీఏలు అందలేదని తెలిపారు.