లోక్సభ ఎన్నిక ముసిగినందున కొన్ని వస్తువులు, సేవల ధరలు పెరుగనున్నాయి. రేట్లు పెరిగే లిస్ట్లో టీవీ ఛానెల్ సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. వాస్తవానికి, మన దేశంలోని పాపులర్ ఛానెళ్లు డిస్నీ స్టార్, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ తమ సబ్స్క్రిప్షన్ రేట్లను 5 శాతం నుంచి 25 శాతం మేర ఈ ఏడాది జనవరిలోనే పెంచాయి. అయితే, కొత్త రేట్లు ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఎన్నికలు ముగిసినందున త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.