కిర్గిజ్స్థాన్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కిర్గిజ్స్థాన్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 2,000 మంది విద్యార్థుల భద్రత కోసం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ను బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ఆదివారం సాయం కోరారు. కిర్గిజిస్తాన్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వైద్య విద్యార్థుల భద్రత కోసం జోక్యం చేసుకోవాలని కోరారు. సాయం కోరిన వెంటనే స్పందించిన జైశంకర్ సరైన చర్యలకు హామీ ఇచ్చారు.