సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎస్కే మేనేజ్మెంట్ లోని ఓ అధికారి ఈ విషయంపై స్పందించారు. “తన రిటైర్మెంట్ గురించి మేనేజ్మెంట్ కు ధోనీ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. తన తుది నిర్ణయం చెప్పడానికి రెండు నెలల సమయం కావాలని మాత్రమే ధోనీ చెప్పారు” అని పేర్కొన్నారు.