ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజులపాటు తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో.. సోమ, మంగళవారాల్లో ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన హీట్వేవ్ పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. అలాగే ఈ వారమంతా గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్లోనూ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని తెలిపింది.