విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలస వేదికగా శనివారం సీఎం జగన్ 2024 ఎన్నికల శంఖం పూరించారు. సిద్ధం పేరుతో నిర్వహించిన ఈ సభకు సంబంధించిన ప్రసంగాన్ని ఆయన ట్వీట్ చేశారు. "ఈ దుష్టచతుష్టయం పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు. పెత్తందారులపై ఈ కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా..?" అని జగన్ ట్వీట్ చేశారు.