సీఎం జగన్పై నిన్న రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు వేగంగా విచారణ జరుపుతున్నారు. విజయవాడ సింగ్ నగర్లోని పాఠశాల వద్దకు రాగానే ఆయనపై రాయితో దాడి జరిగింది. నిందితులు స్కూల్ బిల్డింగ్లోని ఓ ఫ్లోర్ నుంచి రాయి విసిరి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.