ఏపీలో
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో కొందరు నేతలు పార్టీ వీడే ఆలోచన చేస్తున్నారు.
టీడీపీ-జనసేనలో సీట్ల పంచాయితీ మొదలైనట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. ఇప్పుడు అనకాపల్లి సీటు మరొకరికి ఇవ్వనున్న విషయం తెలుసుకున్న అయ్యన్న లోలోపల రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.