ప్రజాకళామండలి నేతకు కన్నీటి వీడ్కోలు

69చూసినవారు
ప్రజాకళామండలి నేతకు కన్నీటి వీడ్కోలు
ప్రజా కళా మండలి రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ ఉన్నం నాగేశ్వరరావుకు ప్రజా కళామండలి నాయకులు డప్పు దరువుల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. ఉన్నం నాగేశ్వరరావు హార్ట్ స్ట్రోక్ తో శుక్రవారం ఉదయం మృతి చెందారు. శనివారం వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆయన మృతదేహానికి పూలమాలవేసి ఎర్రజెండా కప్పి సత్తెనపల్లి పట్టణ వీధుల్లో అంతిమ యాత్ర నిర్వహించారు. అంత్యక్రియలకు కళాకారులు, లాయర్లు, కార్మికులు, భారీగా హాజరై ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్